Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి, ద్వార పాలకులను గాయకులను లేవీయులను నియమించిన పిమ్మట
1. ఈ విధంగా, మేము ప్రాకార నిర్మాణం పూర్తి చేశాము. తర్వాత మేము ద్వార పాలకులను ఎంపిక చేశాము. ఆలయ గాయకులుగా వుంటూ, యాజకులకు తోడ్పడేవాళ్లను ఎంపిక చేశాము.
2. నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతియైన హనన్యాకును యెరూషలేముపైన అధి కారము ఇచ్చితిని. హనన్యా నమ్మకమైన మనుష్యుడు, అందరికంటె ఎక్కువగా దేవునియెదుట భయభక్తులు గలవాడు.
2. అటు తర్వాత, నా సోదరుడు హనానీని యెరూషలేముకి అధికారిగా నియమించాను. హనన్యా అనే మరో వ్యక్తిని కోటకి సేనాధిపతిగా నియమించాను. నేను హనానీని ఎందుకు ఎంపిక చేశానంటే, అతను చాలా నిజాయితీ పరుడు. అత్యధిక సంఖ్యాకులు కంటె, అతను అధిక దేవుని భయం కలిగినవాడు.
3. అప్పుడు నేనుబాగుగా ప్రొద్దెక్కు వరకు యెరూషలేముయొక్క గుమ్మముల తలుపులు తియ్యకూడదు;మరియు జనులు దగ్గర నిలువబడియుండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వేయవలెననియు, ఇదియుగాక యెరూషలేము కాపురస్థు లందరు తమ తమ కావలి వంతులనుబట్టి తమ యిండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమింపవలెననియు చెప్పితిని.
3. అప్పుడు నేను హనానీనీ, హనన్యానీ ఇలా ఆదేశించాను: “కొన్ని గంటలు పొద్దెక్కిన తర్వాత మాత్రమే మీరు యెరూషలేము ద్వారాలు తెరవాలి. పొద్దుగుంకేలోగానే మీరు తలుపులు మూసి, తాళాలు బిగించాలి. అంతేకాదు, కాపలా పనికి మనుష్యుల్ని యెరూషలేము నుంచి ఎంపిక చెయ్యండి. వాళ్లలో కొంతమందిని నగర రక్షణకిగాను ప్రత్యేక స్థానాల్లో నిలపండి. మిగిలిన వాళ్లని వాళ్ల వాళ్ల ఇళ్ల దగ్గరే పెట్టండి. “
4. అప్పటిలో ఆ పట్టణము మిగుల విశాలముగాను పెద్దదిగాను ఉండెనుగాని దానిలో జనులు కొద్దిగా ఉండిరి, యిండ్లు ఇంక కట్టబడలేదు.
4. అప్పుడు ఆ నగరం విశాలంగా పుంది, కావలసి నంతకన్న ఎక్కువ ఖాళీ స్థలం ఏర్పడింది. అయితే, నగరంలో కొద్దిమందే వున్నారు. ఇళ్లు తిరిగి ఇంకా నిర్మింపబడలేదు.
5. జనసంఖ్యచేయునట్లు నా దేవుడు నా హృదయములో తలంపు పుట్టింపగా, ప్రధానులను అధికారులను జనులను నేను సమకూర్చితిని. అంతలో ముందు వచ్చినవారినిగూర్చిన వంశావళి గ్రంథము నాకు కనబడెను, అందులో వ్రాయబడిన వంశావళులు ఇవి.
5. జనం అందర్నీ సమావేశ పరచాలన్న సంకల్పాన్ని దేవుడు నాకు కలిగించాడు. నేను ముఖ్యుల్ని, ఉద్యోగుల్ని, సామాన్యుల్ని అందర్నీ సమావెశానికి పిలిచాను. నేనీ పని కుటుంబాలన్నింటి జాబితా తయారు చేయగలుగుతానన్న భావంతో చేశాను. మొదట దేశమునుండి వెళ్లగాట్టబడిన వారిలో తిరిగి వచ్చిన వాళ్ల కుటుంబాల జాబితాలు నాకు దొరికాయి. అక్కడ వ్రాసివున్న సమాచారం ఇది.
6. జెరుబ్బాబెలు యేషూవ నెహెమ్యా అజర్యా రయమ్యా నహమానీ మొర్దెకై బిల్షాను మిస్పెరేతు బిగ్వయి నెహూము బయనా అనువారితోకూడ బాబెలు రాజైన నెబుకద్నెజరుచేత చెరలోనికి కొనిపోబడి
6. చెరనుంచి తిరిగి వచ్చిన వాళ్ల వివరం వుంది. వెనక బబులోను రాజు మెబుకద్నెజరు వీళ్లని బబులోనుకి బందీలుగా పట్టుకుపోయాడు. వాళ్లు ఇప్పుడు యెరూషలేముకీ, యూదాకీ తిరిగి వచ్చారు. వాళ్లలో ప్రతి ఒకడూ తన సొంత పట్టణానికి పోయాడు.
7. తిరిగి యెరూషలేమునకును యూదాదేశమునకును తమ తమ పట్టణములకు వచ్చినవారు వీరే. ఇశ్రాయేలీయులయొక్క జనసంఖ్య యిదే.
7. ఈ క్రిందివాళ్లు జెరుబ్బాబెలు తో కలిసి వచ్చారు: యేషూవా, నెహెమ్యా, అజర్యా, రయమ్యా, సహమానీ, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, నెహూము, బయనా. ఇశ్రాయేలుకి చెందిన ఈ క్రింది మనుష్యులు ఈ క్రింది సంఖ్యలో తిరిగి వచ్చారు:
8. అది ఏలాగనగా పరోషువంశస్థులు రెండువేల నూట డెబ్బదియిద్దరును
8. పరోషు వంశీయులు2,172
9. షెఫట్య వంశస్థులు మూడువందల డెబ్బది యిద్దరును
9. షెపట్యా వంశీయులు 372
10. ఆరహు వంశస్థులు ఆరువందల ఏబది యిద్దరును
10. ఆరహు వంశీయులు 652
11. యేషూవ యోవాబు సంబంధు లైన పహత్మోయాబు వంశస్థులు రెండువేల ఎనిమిదివందల పదునెనిమిదిమందియు
11. పహత్మోయాబు వంశీయులు (వీళ్లు యేషూవ, జోయాబు కుదుళ్ల వాళ్లు)2,818
12. ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురును.
12. ఏలాము వంశీయులు1,254
13. జత్తూవంశస్థులు ఎనిమిది వందల నలువది యయిదుగురును
13. జత్తూ వంశీయులు845
14. జక్కయి వంశస్థులు ఏడువందల అరువది మందియు
14. జక్కయి వంశీయులు760
15. బిన్నూయి వంశస్థులుఆరువందల నలువది యెనమండుగురును
15. బిన్నూయి వంశీయులు648
16. బేబై వంశస్థులు ఆరువందల ఇరువది యెనమండుగురును
16. బేబై వంశీయులు628
17. అజ్గాదు వంశస్థులు రెండువేల మూడువందల ఇరువది యిద్దరును
17. అజ్గాదు వంశీయులు2,322
18. అదోనీకాము వంశస్థులు ఆరువందల అరువది యేడుగురును
18. అదోనీకాము వంశీయులు667
19. బిగ్వయి వంశస్థులు రెండు వేల అరువది యేడుగురును
19. బిగ్వయి వంశీయులు2,067
20. అదీను వంశస్థులు ఆరువందల ఏబది యయిదుగురును
20. ఆదీను వంశీయులు655
21. హిజ్కియా బంధువుడైన ఆటేరు వంశస్థులు తొంబది యెనమండు గురును
21. హిజ్కియా కుటుంబానికి చెందిన ఆటేరు వంశీయులు98
22. హాషుము వంశస్థులు మూడువందల ఇరువది యెనమండుగురును
22. హాషూము వంశీయులు328
23. జేజయి వంశస్థులు మూడువందల ఇరువదినలుగురును
23. బేజయి వంశీయులు324
24. హారీపు వంశస్థులు నూటపండ్రెండు గురును
24. హారీపు వంశీయులు112
25. గిబియోను వంశస్థులు తొంబది యయిదు గురును
25. గిబియోను వంశీయులు95
26. బేత్లెహేము నెటోపావారు నూట ఎనుబది యెనమండు గురును
26. బేత్లేహేము, నెటోపా పట్టణాల వాళ్లు188
27. అనాతోతువారు నూట ఇరువది యెనమండు గురు
27. అనాతోతు పట్టణం వాళ్లు128
28. బేతజ్మావెతువారు నలువది యిద్దరును
28. బేతజ్మావెతు పట్టణం వాళ్ల42
29. కిర్యత్యారీము కెఫీరా బెయేరోతులవారు ఏడువందల నలువది ముగ్గురును
29. కిర్యతారీము, కెఫీరా, బేయెరోతు పట్నాల వాళ్లు743
30. రామా గెబలవారు ఆరువందల ఇరువది యొకరును
30. రమా, గెబ పట్టణాల వాళ్లు621
31. మిక్మషువారు నూట ఇరువది యిద్దరును
31. మిక్మషు పట్టణం వాళ్లు122
32. బేతేలు హాయిలవారు నూట ఇరువది ముగ్గురును
32. బేతేలు, ఆయి పట్టణాల వాళ్లు123
33. రెండవ నెబోవారు ఏబది యిద్దరును
33. రెండవ నెబో పట్టణం వాళ్లు52
34. రెండవ ఏలాము వారు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురును
34. రెండవ ఏలాము పట్టణం వాళ్లు1,254
35. హారిము వంశస్థులు మూడువందల ఇరువది మందియు
35. హారిము పట్టణం వాళ్లు320
36. యెరికో వంశస్థులు మూడువందల నలువది యయిదుగురును
36. యెరికో పట్టణం వాళ్లు345
37. లోదు హదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడువందల ఇరువది యొకరును
37. లోదు హదీదు, ఓనో పట్టణాల వాళ్లు721
38. సెనాయా వంశస్థులు మూడువేల తొమ్మిది వందల ముప్పది మందియు
38. సెనాయా పట్టణం వాళ్లు3,930
39. యాజకులలో యేషూవ యింటివారైన యెదాయా వంశస్థులు తొమ్మిదివందల డెబ్బది ముగ్గురును
39. వీళ్లూ యాజకులు:యేషూవా కుటుంబం ద్వారా యెదాయా వంశీయులు973
40. ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది యిద్దరును
40. ఇమ్మేరు వంశీయులు1,052
41. పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువది యేడుగురును
41. పషూరు వంశీయులు1,247
42. హారిము వంశస్థులు వెయ్యిన్ని పదు నేడుగురును
42. హారిము వంశీయులు1,017
43. లేవీయులైన యేషూవ హోదవ్యా కద్మీయేలు అనువారి వంశస్థులు డెబ్బది నలుగురును
43. లేవీ వంశానికి చెందిన వాళ్లు: యేషువా, హోదేయా , కద్మీయులు74
44. గాయకు లైన ఆసాపు వంశస్థులు నూట నలువది యెనమండుగురును
44. వీళ్లు గాయకులు: ఆసావు వంశీయులు148
45. ద్వారపాలకులైన షల్లూము వంశస్థులు అటేరు వంశస్థులు టల్మోను వంశస్థులు అక్కూబు వంశస్థులు హటీటా వంశస్థులు షోబయి వంశస్థులు నూట ముప్పది యెనమండు గురును
45. వీళ్లు ద్వారపాలకులు: షల్లూము, అటేరు, టల్మోను, అక్కూబ, హటీటాం, షోబయి వంశీయులు138
46. నెతీనీయులైన జీహా వంశస్థులు హశూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు
46. వీళ్లు ఈ కింది వంశాల ఆలయ ప్రత్యేక సేవకులు: జీహా, హశూఫా, టబ్బాయేలు
47. కేరోసు వంశస్థులు సీయహా వంశస్థులు పాదోను వంశస్థులు
47. కేరోసు, సీయహా, పాదోను,
48. లెబానా వంశస్థులు హగాబా వంశస్థులు షల్మయి వంశస్థులు
48. లెబానా, హగాబా, షల్మయి,
49. హానాను వంశస్థులు గిద్దేలు వంశస్థులు గహరు వంశస్థులు
49. హానాను, గిద్దేలు, గహరు
50. రెవాయ వంశస్థులు రెజీను వంశస్థులు నెకోదా వంశస్థులు
50. రెవాయ, రెజీను, నెకోదా,
51. గజ్జాము వంశస్థులు ఉజ్జా వంశస్థులు పాసెయ వంశస్థులు
51. గజ్జాము, ఉజ్జా, పాసెయ.
52. బేసాయి వంశస్థులు మెహూనీము వంశస్థులు నెపూషేసీము వంశస్థులు.
52. బేసాయి, మెహూనీము, నెపూషేసీము.
53. బక్బూకు వంశస్థులు హకూపా వంశస్థులు హర్హూరు వంశస్థులు
53. బక్బూకు, హకూఫా, హర్హారు,
54. బజ్లీతు వంశస్థులు మెహీదా వంశస్థులు హర్షా వంశస్థులు
54. బజ్లీతు, మెహీదా, హర్షా,
55. బర్కోసు వంశస్థులు సీసెరా వంశస్థులు తెమహు వంశస్థులు నెజీయహు వంశస్థులు హటీపా వంశస్థులు
55. బర్కోసు, సీసెరా, తెమాహా,
56. సొలొమాెెను దాసుల వంశస్థులు సొటయి వంశస్థులు
56. నెజీయహు, హటేపా.
57. సోపెరెతు వంశస్థులు పెరూదా వంశస్థులు
57. సొలొమోను దాసులు వంశాలకు చెందిన వారు: సొటయి, సోపెరెతు, పెరూదా,
58. యహలా వంశస్థులు దర్కోను వంశస్థులు గిద్దేలు వంశస్థులు
58. యహలా, దర్కొను, గిద్దేలు,
59. షెఫట్య వంశస్థులు హట్టీలు వంశస్థులు జెబాయీయుల సంబంధమైన పొకెరెతు వంశస్థులు ఆమోను వంశస్థులు.
59. షెఫట్యా, హట్టీలు, పొకెరెతు, హజ్జెబాయిము, అమోను.
60. ఈ నెతీనీయులందరును సొలొమోను దాసుల వంశస్థులును మూడువందల తొంబది యిద్దరు.
60. ఆలయ సేవకులు, సొలొమోను దాసుల వంశీయులు కలిసి మొత్తం392
61. తేల్మెలహు తేల్హర్షా కెరూబు అదోను ఇమ్మేరు మొద లైన స్థలములనుండి వచ్చినవారు తాము ఇశ్రాయేలీయుల సంబంధులో కారో తెలుపుటకు తమ యింటి పేరులైనను తమ వంశావళి పత్రికయైనను కనుపరచలేకపోయిరి.
61. కొందరు ఈ క్రింది పట్టణాలనుంచి యెరూషలేముకు వచ్చారు. తేల్మెలెహు, తెత్వెర్షా, కెరూబు, అదోను, ఇమ్మేరు, అయితే, వీళ్లు తమ కుటుంబాలు ఇశ్రాయేలుకి చెందినవో కావో నిరూపించుకోలేక పోయారు.
62. వారెవరనగా దెలాయ్యా వంశస్థులు టోబీయా వంశస్థులు నెరోదా వంశస్థులు వీరు ఆరువందల నలువది యిద్దరు
62. దెలాయ్యా, టోబీయా, నెకొనిదా వంశీయులు642
63. హబాయ్యా వంశస్థులు హక్కోజు వంశస్థులు బర్జిల్లయి వంశస్థులు, అనగా గిలాదీయులైన బర్జిల్లయి కుమార్తెలలో ఒకతెను పెండ్లి చేసికొని వారి పేరుచేత పిలువబడిన బర్జిల్లయి వంశస్థులును యాజక సంతానులు.
63. యాజక కుటుంబాల్లో చేరినవాళ్లు హబాయా, హక్కోజు, బర్జిల్లయి (గిలాదీయులైన బర్జిల్లయి కుమారైలను పెళ్లి చేసుకున్నవాళ్లు బర్జిల్లయి వంశీయులుగా గణింపబడ్డారు.)
64. వీరి వంశా వళులనుబట్టి యెంచబడినవారిలో వారి పద్దు పుస్తకమును వెదకగా అది కనబడకపోయెను; కాగా వారు అపవిత్రు లుగా ఎంచబడి యాజకులలో ఉండకుండ వేరుపరచబడిరి.
64. వీళ్లు తమ కుటుంబ చరిత్రల కోసం గాలించారు, కాని అవి వాళ్లకి దొరకలేదు. తాము యాజకులుగా పని చేయగలిగేందుకు గాను, తమ పూర్వీకులు యాజకులన్న విషయాన్ని వాళ్లు నిరూపించలేక పోయారు. దానితో, వాళ్ల పేర్లు యాజకుల జాబితాలో చేర్చ బడలేదు.
65. కాగా అధికారిఊరీము తుమీ్మము అనువాటిని ధరించు కొని ఒక యాజకుడు ఏర్పడువరకు అతి పరిశుద్ధవస్తువులను మీరు తినకూడదని వారితో చెప్పెను.
65. అత్యంత పవిత్రమైన వస్తుపులను వాళ్లకి ఇవ్వరాదని పాలనాధికారి ఆజ్ఞ జారీ చేశాడు. ప్రధాన యాజకుడు ఊరీము, తుమ్మీము ఉపయోగించి దేవుని సంకల్పం తెలుసుకునేందుకోసం అర్థించి ప్రార్థించేదాకా వాళ్లు ఈ అతి పరిశద్ధ వస్తుపుల్లో వేటికీ అర్హులు కాకుండా పోయారు.
66. సమాజకులందరును నలువది రెండువేల మూడువందల అరువదిమంది.
66.
67. వీరు గాక వీరి పని వారును పనికత్తెలును ఏడు వేల మూడు వందల ముప్పది యేడుగురును, గాయకులలో స్త్రీ పురు షులు రెండువందల నలువది యయిదుగురునై ఉండిరి.
67.
68. వారి గుఱ్ఱములు ఏడువందల ముప్పది ఆరును, వారి కంచర గాడిదలు రెండువందల నలువది యయిదును
68.
69. వారి ఒంటెలు నాలుగువందల ముప్పది యయిదును వారి గాడిదలు ఆరు వేల ఏడువందల ఇరువదియునై యుండెను.
69.
70. పెద్దలలో ప్రధానులైన కొందరు పనికి కొంత సహా యము చేసిరి. అధికారి ఖజానాలో నూట ఇరువది తులముల బంగారమును ఏబది పళ్లెములను ఏడువందల ముప్పది యాజక వస్త్రములను వేసి యిచ్చెను.
70. కుటుంబ పెద్దలు కొందరు పనినిర్వహణకు సహాయంగా కొంత డబ్బు ఇచ్చారు. పాలనాధికారి ఖజానాకు 19 పౌనుల బంగారు ఇచ్చాడు. అతను 50 పళ్లాలు, యాజకులు ధరించేందుకు 530 జతల దుస్తులు కూడా ఇచ్చాడు.
71. మరియు పెద్దలలో ప్రధానులైనవారు కొందరు ఖజానాలో నూట నలువది తులముల బంగారమును పదునాలుగు లక్షల తుల ముల వెండిని వేసిరి.
71. కుటుంబ పెద్దలు పని నిర్వహణ కోసం 375 పౌనులు, బంగారాన్ని ఖజానాకి ఇచ్చారు. వాళ్లు 1 1/3 టన్నులు వెండిని కూడ ఇచ్చారు.
72. మిగిలినవారును రెండువందల నలువది తులముల బంగారమును రెండువందల నలువది లక్షల తుల ముల వెండిని అరువదియేడు యాజక వస్త్రములను ఇచ్చిరి.
72. మొత్తంమీద ఇతరులు 375 పౌనుల బంగారము 1 1/3 టన్నుల వెండిని తులాల వెండి, యాజకుల కోసం 67 రకాల దుస్తులు ఇచ్చారు.
73. అప్పుడు యాజకులు లేవీయులు ద్వారపాలకులు గాయ కులు జనులలో కొందరును, నెతీనీయులు ఇశ్రాయేలీయు లందరును, తమ పట్టణములయందు నివాసము చేసిరి.
73. ఈ విధంగా యాజకులు, లేవీయులు, ద్వార పాలకులు, గాయకులు, ఆలయ సేవకులు తమతమ సొంత పట్టణాలలో స్థిరపడ్డారు. కాగా, ఇతర ఇశ్రాయేలీయులందరూ తమ సొంత పట్టణాల్లో స్థిర పడ్డారు. ఆ సంవత్సరం ఏడవ నెల నాటికి ఇశ్రాయేలీ యులందరూ తమ తమ పట్టణాల్లో స్థిరపడ్డారు.